న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దయ్యింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం సాయంత్రం హైదరాబాద్ కు వచ్చి… ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్ వెళ్లాల్సి ఉంది. అక్కడ కాంగ్రెస్ కీలక నేతలతో సమావేశం ఉంటుందని అంతా భావించారు. ఈ పర్యటన అనంతరం రాత్రి కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి రైల్లో తమిళనాడుకు బయల్దేరాల్సి ఉంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న విద్యార్థులతో రైల్లో ముఖాముఖి నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రాహుల్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.