ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. ఈసందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ… వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాబోయే కొన్ని రోజులు తాను ఫ్రాన్స్, అమెరికాలో ఉంటానని చెప్పారు.
ఫ్రాన్స్ లో జరిగే ఏఐ యాక్షన్ సమ్మిట్ లో పాల్గొంటానని పేర్కొన్నారు. ఇండియా-ఫ్రాన్స్ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ తో చర్చలు జరుపుతానని వెల్లడించారు. మార్సిల్లేలో కాన్సులేట్ ను కూడా ప్రారంభించనున్నట్టు కూడా తెలిపారు.