Press Meet | రోహింగ్యాల వలసలతో అంతర్గత భద్రతకు ప్రమాదం – పవన్ కల్యాణ్

• స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంలో వ్యవస్థలోని కొందరు ప్రాత్ర ఉంది
• సరిహద్దుల్లో సైనికుల అప్రమత్తత కంటే మిన్నగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
• దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నిత లక్ష్యాల్లో ఉన్నాయి
తీరంలో కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలి
• కుంకీ ఏనుగుల ద్వారా మదపుటేనుగుల గుంపు సమస్యకు పరిష్కారం లభిస్తుంది
• గన్నవరం విమానాశ్రయంలో జాతీయ మీడియాతో పవన్ కళ్యాణ్

గ‌న్న‌వ‌రం – సరిహద్దుల్లో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారో, దేశం లోపల అంతర్గత భద్రతలో పోలీసు శాఖ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండటం కీలకమ‌ని అన్నారు ఎపి ఉప‌ ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. . దీనిపైనే రాష్ట్ర పోలీసులను, పరిపాలన సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తూ సంబంధిత అధికారుల‌కు లేఖలు రాశానని తెలిపారు.

గన్నవరం విమానాశ్రయంలో నేడు ప‌వ‌న్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యం అని పేర్కొన్నారు. గతంలో కోయంబత్తూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులు తల్చుకుంటే ఇప్పటికీ గుండె తరుక్కుపోతుందని చెప్పారు. సరిహద్దుల్లో భద్రతా సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉంటారో, రాష్ట్ర పోలీసులు కూడా అంతర్గత భద్రతపై అంతే సీరియస్ గా దృష్టి సారించాలని స్పష్టం చేశారు.

పాలనా యంత్రంగంతో సమన్వయం చేసుకొని ఉగ్రవాద జాడలు కలిగిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిజిపిని కోరారు. ముఖ్యంగా వలసదారుల విషయంలో తగిన నిఘాను ఉంచితే జరగబోయే ప్రమాదాలను నివారించవచ్చ‌ని ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు.. అలాగే తీర ప్రాంతంలో సైతం నిరంతర పర్యవేక్షణ, నిఘా పెంచుకోవాల్సిన అవసరం ఉంద‌ని అంటూ . గతంలోనూ కాకినాడలో బయట వ్యక్తులు బోట్లలో వచ్చినట్లు కొన్ని వార్తలు వచ్చాయ‌ని వివ‌రించారు.

రోహింగ్యాల వలసలపై దృష్టి సారించాలి
గతంలో పశ్చిమ బెంగాల్ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు విపరీతంగా రోహింగ్యాలు వలసదారులు వచ్చార‌న్నారు ప‌వ‌న్. ముఖ్యంగా 2017-18 ప్రాంతాల్లో కోల్ కత నుంచి స్వర్ణకార వృత్తి నిమిత్తం చాలా అధికంగా వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వచ్చార‌ని వివ‌రించారు. . రోహింగ్యాల మూలాలు మయన్మార్ లో ఉన్నాయ‌ని,. వారి వలసలతో స్థానిక యువత నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటోంద‌న్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్ అని ప‌వ‌న్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో ఉన్న మూడు ప్రధాన డిమాండ్లలో స్థానికులకే ఉద్యోగాలు అనేది కూడా ప్రధాన నినాదమ‌ని గుర్తు చేశారు. అయితే రోహింగ్యాలు దేశం దాటి వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకునేలా రేషన్, ఆధార్, ఓటరు కార్డులు పొందుతున్నారని తెలిపారు. రోహింగ్యాలకు స్థిర నివాసం ఏర్పరుచుకోవడంలో మన యంత్రాంగం నిర్లక్ష్యం ఉంద‌ని చెప్పారు.

కుంకీ ఏనుగుల ద్వారా సమస్య పరిష్కారం
సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మదపుటేనుగుల గుంపులు పంట పొలాల్లోకి వస్తూ పంటకు, పొలాలలో ఉన్నవారి ప్రాణాలను తీస్తున్నాయ‌ని అన్నారు ప‌వ‌న్. . ముఖ్యంగా చిత్తూరు, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఈ సమస్య ఉంద‌న్నారు. వాటికి పరిష్కారంగా గతంలోనే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి 6 కుంకీ ఏనుగుల కోసం ఒప్పందం చేసుకున్నామ‌ని గుర్తు చేశారు డిప్యూటీ సిఎం. దీనికి అనుగుణంగా రాష్ట్రానికి 6 కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఈ నెల 21వ తేదీన ఇవ్వనుంద‌న్నారు.. కుంకీ ఏనుగుల ద్వారా మదపుటేనుగుల విధ్వంసం నుంచి బయటపడగలం అనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి సహకారం కర్ణాటక ప్రభుత్వం అందించడం అభినందనీయమ‌ని అన్నారు.రాష్ట్రంలో ఈ ఏనుగుల రాక‌తో ఇక్క‌డ ఏనుగుల దాడులు త‌గ్గుతాయ‌ని భావిస్తున్న‌ట్లు ప‌వ‌న్ దీమా వ్య‌క్తం చేశారు.

Leave a Reply