Phone Tapping | హైదరాబాద్ చేరుకున్న సిబ్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు

హైదరాబాద్: సిబ్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు (Prabhakar Rao: SIB)హైదరాబాద్‌కు చేరుకొన్నారు 14 నెలల తర్వాత ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చారు.. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో సిట్‌ (SIT )విచారణకు ప్రభాకర్‌రావు హాజరుకానున్నారు.

ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా +America ) నుంచి దుబాయి(Dubai )మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఏ1గా ఉన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై పంజాగుట్ట పీఎస్‌లో గతేడాది కేసు నమోదైన విషయం తెలిసిందే. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు కోసం అధికారులు సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నమోదైన కొద్ది రోజులకు ప్రభాకర్‌రావు అమెరికా వెళ్లిపోయారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అధికారులు నలుగురిని అరెస్టు చేశారు. వారిచ్చిన వాంగ్మూలం మేరకు ప్రభాకర్‌రావును భారత్‌ రప్పించేందుకు పోలీసులు ప్రయత్నించారు. సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలతో అమెరికా నుంచి ప్రభాకర్‌రావు భారత్‌కు వచ్చారు. ఎమర్జెన్సీ ట్రావెల్‌ డాక్యుమెంట్‌తో ప్రభాకర్‌రావు భారత్‌కు చేరుకున్నారు.

ఇదే కేసులో అరెస్టైన ఇతర నిందితులు ఇచ్చిన సమాచారంతో ప్రభాకర్‌రావును ప్రశ్నించబోతోంది. సిట్‌ టీమ్. ప్రభాకర్‌రావు ద్వారా రాబట్టే అంశాలతో… ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ కొలిక్కి వస్తుందని సిట్‌ భావిస్తోంది.ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారిన తర్వాత.. ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు. తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థన మేరకు.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. ప్రభాకర్ రావు పాస్ట్‌పోర్టును రద్దు చేసింది.

అయితే.. మే 29న ప్రభాకర్ రావు పాస్‌పోర్ట్ (Passport) పునరుద్ధరించాలని, ట్రావెల్ వీసా జారీ చేయాలని.. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణకు హాజరయ్యేందుకు వీలు వీలు కల్పించాలనే ఉద్దేశంతో.. సుప్రీం ఈ ఆదేశాలిచ్చింది. అయితే.. భారత్‌కు వచ్చేందుకు అవసరమైన ట్రావెల్ డాక్యుమెంట్ (Travel Document) వచ్చాక.. 3 రోజుల్లోగా హైదరాబాద్‌కు వచ్చి విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది.

బీఆర్ఎస్ హయాంలో సిబ్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పంజాగుట్ట పోలీసులు (Punjagutta Police) 2024, మార్చి 10న కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావే. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే భారత్‌కు తిరిగి వస్తానని గతంలో హైకోర్టును ఆశ్రయించారు ప్రభాకర్‌రావు. కానీ.. ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేశారాయన. సుప్రీం కోర్టు ఆదేశాలతో విచారణకు హాజరవుతున్నారు.

ప్రభాకర్ రావు 14 నెలలుగా అమెరికాలో ఉన్నారు. ఆయనపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేసింది. నాంపల్లి కోర్టు ఆయనకు వ్యతిరేకంగా ప్రొక్లెమేషన్ ఆర్డర్ జారీ చేసింది. ఈ నెల 20 లోపు ఆయన గనక విచారణకు హాజరుకాకపోతే.. అధికారికంగా ప్రకటించిన నేరుస్తుడిగా.. ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి.. వీసా (VISA) ప్రక్రియ పూర్తికావడంతో.. ఆయన ఇండియాకు వచ్చి విచారణకు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు.

Leave a Reply