Amaravati | ప‌వ‌న్ కు మోడీ చాక్లెట్ గిఫ్ట్

అమ‌రావ‌తి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరైన అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ముఖ్య నేతలందరూ సభా వేదికపై ఆశీనులై ఉండగా… ప్రధాని మోదీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను దగ్గరకు పిలిచారు.

ప్రధాని ఎందుకు పిలిచారోనని పవన్ హడావిడిగా వచ్చారు… అప్పుడు మోదీ తన వద్ద ఉన్న చాక్లెట్ ను పవన్ కు ఇవ్వడంతో వేదికపై నవ్వులు విరబూశాయి. మోదీ, చంద్రబాబు నవ్వడంతో… పవన్ కూడా చేతిలో ఉన్న చాక్లెట్ ను చూసుకుని వారితో కలిసి తాను కూడా నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *