may16cbi | ఫెడరల్‌ వ్యవస్థలో సీబీఐ ఉనికి ప్రశ్నార్థకం

may16cbi | ఫెడరల్‌ వ్యవస్థలో సీబీఐ ఉనికి ప్రశ్నార్థకం

may16cbi | సీబీఐ డైరెక్టర్‌ నియామకంపై రాహుల్‌ గాంధీ ప్రశ్నలు
సీబీఐ చట్టబద్ధతపై గౌహతి హైకోర్టు వ్యాఖ్యలు
రాష్ట్రాల సమ్మతి ఉపసంహరణతో పెరిగిన వివాదం
సెక్షన్‌ 17-ఏ, 19లతో దర్యాప్తుపై అవరోధాలు
సుప్రీంకోర్టు వైఖరి, పెండింగ్‌లో కీలక తీర్పులు
సీబీఐ భవిష్యత్తుపై పెరుగుతున్న అనుమానాలు

may16cbi | కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరక్టర్‌ నియామకం పద్దతిలో రాజ్యాంగ ఔచిత్యాన్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్‌ నాయకుడు,లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఒక లేఖ రాశారు.ఈ పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే ప్రశ్న కాదిక్కడ,అసలు ఫెడరల్‌ వ్యవస్థలో ఈ పదవి అవసరం ఎంతవరకూ ఉందనే దానిని ప్రశ్నిస్తూ ఆయన ఈ లేఖ రాశారు.

సీబీఐని గతంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్ట్‌ గేషన్‌ అని ఎద్దేవా చేసింది.సీబీఐ అధికారంలో ఉన్న వారి వాణిని చిలుక పలుకుగా వినిపిస్తూ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించింది.దీంతో సీబీఐ డైరక్టర్‌ ఎంపిక పద్దతిలో మార్పు చేశారు.ప్రధానమంత్రి,లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా గల కమిటీ సీబీఐ డైరక్టర్‌ ని ఎంపిక చేసేందుకు నిర్ణయం జరిగింది.అధికార గణం నుంచే ఈ ఎంపిక జరగాలని కూడా నిర్ణయించింది.ఈ పదవికి అలోక్‌ వర్మను మొదట నియమించారు.ఆయనపై ఆరోపణలు రావడంతో ఆయన కింది అధికారి అయిన ఎం నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించి ఆయన తప్పుకున్నారు.2019జనవరి 8వ తేదీన అలోక్‌ వర్మను సుప్రీంకోర్టు తిరిగి నియమించింది.ఆయనపై వచ్చిన ఆరోపణలను ఎంపిక కమిటీ సీవీసీ నివేదికను పరిగణనలోకి తీసుకోలేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆరోపించారు.స్పెషల్‌ డైరక్టర్‌ రాకేష్‌ ఆస్తానా ఫిర్యాదును పురస్కరించుకుని వర్మపై చర్యతీసుకున్నారు.ప్రస్తుతం అది విచారణలో ఉంది.

may16cbi | ఇసుకలో కట్టిన భవనం: సీబీఐ చట్టబద్ధతపై సందేహాలు

సీబీఐ ఏం చేయకూడదో పరిశీలించేముందు,సీబీఐకి న్యాయపరమైన హక్కులు లేవనే విషయాన్ని తెలుసుకోవాలి.గౌహతి హైకోర్టు2013లో ఇచ్చిన తీర్పులో (నవీంద్ర కుమార్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా ) కేసులో చాలా స్పష్టంగా చెప్పింది.ఏమని అంటే,రాజ్యాంగం ప్రకారం పోలీసు స్టేట్‌ పరిధిలోకి వచ్చే అంశమైనప్పటికీ సీబీఐని ఏర్పాటు చేశారని.సరైన చట్టం లేకుండా ఒక సంస్థకు దర్యాప్తు అధికారాన్ని కేంద్రం ఇవ్వజాలదని కోర్టు స్పష్టం చేసింది.ఆ మరునాడే సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వుపై స్టే ఇచ్చింది.ఆ అంశం న్యాయపరమైన అనిశ్చితిలో ఉంది.రాజ్యాంగంగా అనిశ్చితపరిస్థితిలో ఏర్పాటైన సంస్థ ఇప్పటికీ దర్యాప్తు జరుపుతోంది.

సిబీఐ చట్టబద్ధత క్రమంగా ఖాళీ అవుతూ వస్తోంది.మొదటిది 2008లో ముంబాయిలో ఉగ్రవాదుల దాడుల తర్వాత ఏర్పాటైన **నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)**ను ఆనాటి కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం ప్రవేశపెట్టారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలపై విచారణ జరపడానికిఈ చట్టాన్ని తీసుకుని వచ్చారు.**అన్‌లాఫుల్‌ యాక్టివిటీస్‌ (ప్రివెన్షన్‌) యాక్ట్‌ (యూఏపీఏ)**ను తీసుకువచ్చారు.సాధారణసమ్మతి లేకుండా మహారాష్ట్ర,పశ్చిమ బంగాల్‌,కేరళ,తెలంగాణ,రాజస్థాన్‌,చత్తీస్‌గఢ్‌,జార్ఖండ్‌లు తమ పరిధిలో సీబీఐ కార్యకలాపాలకు సమ్మతిని ఉపసంహరించాయి.ఆఖరికి ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ఉద్యోగులపై వచ్చిన కేసుల విషయంలో కూడా.

అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్‌ 17-ఏను చేర్చడంపై 2018 జూలైలో ఇచ్చిన తీర్పు ఇంకా చలనం లేకుండానే ఉంది.ప్రభుత్వోద్యోగి అవినీతిపై పోలీసు అధికారి విచారణ జరపరాదనిది ఆ సవరణ అంతరార్థం.రాష్ట్ర డిప్యుటేషన్‌లో ఉన్న ఐఏఎస్‌ అధికారి పై విచారణ జరపాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరమై ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది.

ఈ సెక్షన్‌ ప్రకారం 90రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలని ఉంది,దానిని 30 రోజులు పొడించేందుకు వీలుంది.ఎటువంటి చర్యతీసుకోవడంపై ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. నారా చంద్రబాబునాయుడు వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేసులో 2024జనవరి 16వ తేదీన ద్విసభ్యబెంచ్‌ భిన్నమైన తీర్పు ఇచ్చింది.అది ఇప్పటికీ తేలలేదు.2026జనవరి 13న మళ్ళీ భిన్నమైన తీర్పు వచ్చింది.రాజ్యాంగ బద్ధతపై కూడా ఈసారి తీర్పు వచ్చింది.ఒక న్యాయమూర్తి ఇది రాజ్యాంగ బద్ధం కాదని స్పష్టం చేశారు.ఇలాంటి కేసుల్లో లోక్‌పాల్‌ అనుమతి ఉండాలని మరో న్యాయమూర్తి స్పష్టం చేశారు,ఈ ఇద్దరి అభిప్రాయాలను పెద్ద బెంచ్‌ పరిశీలనలో ఉన్నాయి.సీబీఐ అవినీతి విచారణపై మొదట్లోనే చర్య ఆగిపోయింది.

may16cbi | దర్యాప్తు వ్యవస్థపై పెరుగుతున్న అనుమానాలు

ఈ అవరోధాన్ని దాటడం సాధ్యమా సెక్షన్‌ 19కింద ప్రత్యేక ప్రాసిక్యూషన్‌ అనుమతి అవసరం ఉంటుంది.ఆలిండియా సర్వీసులకు సంబంధించి ప్రతిసభ్యునికీ వర్తించే రీతిలో,కేంద్ర ప్రభుత్వ,లేదా ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిగెజిటెడ్‌ ఉద్యోగికి వర్తించే రీతిలో.న్యాయవ్యవస్థ దీనికి పరిష్కారం కనుగొంటుందని అనుకుంటారు.కానీ,రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు, పెగాసస్‌ ఐఫోన్‌ల హ్యాకింగ్‌,ఇటీవల వంతారా వన్యప్రాణుల గురించి వచ్చిన ఆరోపణల విషయంలో సుప్రీంకోర్టు సీబీఐపై ఆధారపడలేదు.అలాగే, మహువా మొయిత్రా క్యాష్‌ ఫర్‌ క్వెరీ కేసులో సైతం సీబీఐ దర్యాప్తును కోర్టు ఆదేశించలేదు.

పంజాబ్‌లో పరిశ్రమల శాఖ డైరక్టర్‌గా పని చేస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి2008లోపంజాబ్‌ విజిలెన్స్‌ బ్యూరో అధికారులకు పట్టుబడ్డాడు.17 ఏళ్ళతర్వాత కూడా విచారణ ఇంకా ప్రారంభం కాలేదు.రాష్ట్ర ప్రభుత్వం తన సిఫార్సుపై ఏం చేయాలో తెలియక పిల్లి మొగ్గలు వేస్తోంది.

తదుపరి తగిన చర్య తీసుకోవల్సిందిగా కేంద్రం పంజాబ్‌ హర్యానా హైకోర్టును ఆదేశించింది.ఈ లోగా అధికారి చీఫ్‌ సెక్రటరీ స్థాయికి ప్రమోట్‌ అయి తదుపరి రిటైర్‌ అయ్యారు.న్యాయం వాయిదా పడింది.

ఇటీవల జరిగిన ఒక ఉదంతం ఏమిటంటే…చండీగఢ్‌లో కేంద్ర పాలిత ప్రాంతంలో పబ్లిక్‌ సర్వెంట్‌ కేసు విచారణ విషయంలో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.అరెస్టులు కూడా చేసింది.ఆస్తులను స్వాధీనం చేసుకుంది.ఈ విచారణ తతంగం ఫెడరల్‌ రాజకీయ పరిధిలో జరిగిందా అన్న అనుమానం కలుగుతోంది.సీబీఐ కేసు విచారణకు సరైన యంత్రాంగం లేకపోవడం,కేసు మూసేయాలన్న ఒత్తిడి రావడం ఇవన్నీ చూస్తుంటే, సీబీఐ రాజ్యాంగబద్ధతపై ప్రాథమికమైన ప్రశ్న తలెత్తుతోంది.ఈ సంస్థ ఉనికి అవసరమా అనే అనుమానం కలగుతోంది.ఈ సంస్థను మర్యాదగా మూసేస్తే మంచిదేమో.

— న్యూస్‌ డెస్క్‌

CLICK HERE TO READ Rs.90.67 | పెట్రో వాత !

CLICK HERE TO READ MORE

Leave a Reply