ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో భారత్ – బంగ్లా జట్లు తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు… 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది.
ఈ క్రమంలో 229 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది.
రోహిత్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లి (22) మరోసారి నిరాశ పరిచాడు. రెండో వికెట్ గా విరాట్ పెవిలియన్ బాట పట్టాడు. 22.4 రిషద్ హొస్సేన్ బౌలింగ్లో సౌమ్య సర్కార్కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఇక ప్రస్తుతం క్రీజులో శుభమన్ గిల్ (47) – శ్రేయస్ అయ్యార్ ఉన్నారు. టీమిండియా స్కోర్ 112/2.