హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక సంచలన తీర్పు వెలువరించారు. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన పిటిషనర్ దారుడికి రూ.కోటి జరిమానా విధించారు. హైకోర్టులో పెండింగ్లో ఉన్న విషయాన్ని దాచి వేరే బెంచ్ వద్ద పిటిషన్లు దాఖలు చేయడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా రిట్ పిటిషన్లు వేయటంపై జస్టిస్ నగేశ్ భీమపాక సీరియస్ అయ్యారు. ఇది అత్యంత భారీ జరిమాన విధించడంపై న్యాయవాద వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Judgement | హైకోర్టు సంచలన తీర్పు…పిటిషనర్ కు రూ.కోటి జరిమానా
