Indonesia-7-7-Magnitude : భూకంపం అలజడి Andhra Prabha Top News
Indonesia-7-7-Magnitude : భూకంపం అలజడి Andhra Prabha Top News
- ఇండోనేషియాలో.. ఐదుగురు దుర్మరణం
- తప్పిన సునామీ గండం
( ఆంధ్రప్రభ , జకార్త,)

Indonesia-7-7-Magnitude : తూర్పు ఇండోనేషియా తీరంలో శనివారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. వెంటవెంటనే అనేక ప్రకంపనల (ఆఫ్టర్షాక్స్) కారణంగా ఐదుగురు మరణించారు. ఆగ్నేయాసియా దేశంలోని పలు ప్రాంతాల్లో 1 మీటర్ (3 అడుగులు) కంటే తక్కువ ఎత్తు లో సునామీ అలలు నమోదయ్యాయి. భూకంపం వచ్చిన సుమారు మూడు గంటల తర్వాత సునామీ హెచ్చరికను ఉపసంహరించారు. . . నిద్రిస్తున్న సమయంలో భవన శిథిలాలు పడటం వల్ల ఆ ఐదుగురు మరణించారని తూర్పు నుసా తెంగ్గారా ప్రావిన్స్ గవర్నర్ ఇమ్మాన్యుయేల్ మెల్కియాడెస్ లాకా లెనా విలేకరుల సమావేశంలో చెప్పారు.

ప్రజలు భయంతో అరుస్తూ వీధుల్లో పరుగులు తీస్తుండగా, ఒక భవనం కూలిపోయి ధూళి మరియు శిథిలాలుగా మారడాన్ని ఫేస్బుక్లోని ఒక వీడియో చూపించింది; ఇది మౌమెరే (Maumere) ఓడరేవు వద్ద జరిగినట్లు అధికారులు ధృవీకరించారు.ఇది ఇండోనేషియాలోని విస్తార ద్వీపసమూహానికి తూర్పున ఉన్న ఫ్లోర్స్ ద్వీపంలోని సిక్కా రీజెన్సీలో ప్రధాన పట్టణం.ప్రజలను కలవరపెట్టింది.
తూర్పు నుసా తెంగ్గారా, పశ్చిమ నుసా తెంగ్గారా , దక్షిణ సులవేసిలోని కొన్ని ప్రాంతాలలో బలమైన ప్రకంపనలతో జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. , అనేక ప్రాంతాల్లో నివాసితులు సుమారు ఒక నిమిషం పాటు ఈ ప్రకంపనలు ఆందోళన పరిచాయి.

తూర్పు నుసా తెంగ్గారా ప్రావిన్స్లోని ఎండే (Ende) జిల్లాలో ఒక ఆసుపత్రి రోగులను బయటకు తరలిస్తున్నట్లు ‘కొంపస్ టీవీ’ దృశ్యాలు చూపించాయి, ఒక చోట కొండచరియలు విరిగిపడినట్లు ‘కొంపస్.కామ్’ నివేదించింది.
ఇండోనేషియా భూభౌతిక సంస్థ BMKG ఉదయం 4:58 గంటలకు (2158 GMT) 15 కిలోమీటర్ల (9 మైళ్లు) లోతులో మొదటి భూకంపం సంభవించింది. నాగెకియో (Nagekeo)లో సుమారు 2,000 మంది నివాసితులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారని, అనేక ఇళ్లు, గిడ్డంగులు ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నాయని BNPB తెలిపింది. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తాయని అధికారులు వివరించారు.
