TG | వేసవిలో తాగునీటికి ఇబ్బంది ఉండకూడదు : మంత్రి సీతక్క

  • మిషన్ భగీరథ సమీక్ష
  • ఫిబ్రవరి 1 నుంచి సమ్మర్ స్పెషల్ డ్రైవ్

రానున్న వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఈరోజు హైదరాబాద్‌లో మిషన్ భగీరథపై మంత్రి సీతక్క సమీక్షించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు సమ్మర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

సమ్మర్ స్పెషల్ డ్రైవ్‌లో మిషన్‌ భగీరథ అధికారులు డీపీఓ, డీఎల్‌పీఓ, ఎంపీవో, గ్రామ కార్యదర్శి, సీఈ నుంచి ఏఈఈ వరకు పాల్గొంటారని మంత్రి తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో వచ్చే 5 నెలల ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. ప్రతి వ్యక్తికి ప్రతిరోజూ 100 లీటర్ల నీరు అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

మిషన్ భగీరథ పంపులు, నల్లా పైపులను అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలుంటే తొందరగా సరిచేయాలన్నారు. మిషన్ భగీరథ సరఫరాలో ఎలాంటి సమస్య తలెత్తినా ప్రత్యామ్నాయ పద్ధతిలో నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. మిషన్ భగీరథ నీటిపై ప్ర‌జ‌ట‌కు నమ్మకం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు.

Leave a Reply