Crime | అర్ధరాత్రి నిద్రలోనే గొంతు కోసి హత్య..
Crime | వాజేడు, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వాజేడు మండలం దుబ్బగూడెంలో దారుణ హత్య జరిగింది. ఇదే గ్రామానికి చెందిన మడే చలపతి 35 సంవత్సరాలు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో వేట కొడవలితో పీక కోసి హతమార్చారు. ఇది తెలుసుకున్న పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. హత్య ఏ విధంగా జరిగిందనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు డాగ్ స్కాడును రప్పించి వివరాలు సేకరించనున్నట్లు సమాచారం


