చత్తీస్గఢ్-దంతేవాడ జిల్లాలో దారుణం జరిగింది. సర్పంచ్ అభ్యర్థి గొంతు కోసి హత్య చేసారు మావోయిస్టులు.. ఛత్తీస్గఢ్-దంతేవాడ జిల్లాలోని అరన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి జోగా బర్సేను అతి కిరాతకంగా హత్య చేశారు
మావోయిస్టులు.గత రాత్రి ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యుల ఎదుటే గొంతు కోసి హత్య చేశారు మావోయిస్టులు. గతంలో సీపీఐలో ఉండగా.. కొన్నేళ్ల క్రితమే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న జోగా… మావోయిస్టులకు వ్యతిరేకంగా పని చేశారని సమాచారం. మావోయిస్టుల సమాచారం, రహస్యాలను లీక్ చేసిన తరుణంలోనే పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి జోగా బర్సేను హత్య చేశారు.
.