Delhi Results | ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ ను దాటేసిన బీజేపీ

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి కన్పిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పోలిస్తే బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఉదయం 11గంటల వరకు వెలువడిన ఫలితాలను చూస్తుంటే.. ఆధిక్యాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ (36)ను దాటేసింది. ప్రస్తుతం కమలం పార్టీ 41 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఆప్ (AAP) 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఒక చోటు ముందంజలో కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *