AP | ఉత్త‌రాంధ్ర టీచ‌ర్ స్థానంలో పిఆర్టీయు, ఎపిటిఎఫ్ మ‌ధ్య హోరాహోరి

తొలి ప్రాధాన్య‌త ఓట్ల‌లో పిఆర్టీయు అభ్య‌ర్ధి ఆధీక్యం
రెండో స్థానంలో ఎపిటిఎఫ్ అభ్య‌ర్ధి..
తొలి రౌండ్ లో ఏ అభ్య‌ర్ధికి 50 శాతం రాని ఓట్లు
రెండో ప్రాధాన్య‌త ఓట్ల లెక్కింపున‌కు శీకారం

విశాఖ‌ప‌ట్నం – ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఓట్ల లెక్కింపు కొన‌సాగుతున్న‌ది. ఇప్ప‌టికే అధికారులు తొలి రౌండ్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేశారు.. ఈ స్థానానికి మొత్తం 19813 ఓట్లు పోల‌య్యాయి.. ఇందులో పి అర్ టి యూ అభ్య‌ర్ధి గాదె శ్రీనివాసులు నాయుడుకి 7150 ఓట్లు పోల‌య్యాయి. ఇక ఆయ‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి ఏపిటిఎఫ్,కూటమి మద్దతు ఇచ్చిన పాకలపాటి రఘు వర్మకు 6790 ఓట్లు వ‌చ్చాయి.. ఇక యూటిఎఫ్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన కే.విజయ గౌరీ 5873 ఓట్లు ల‌భించాయి.. తొలి రౌండ్ లో పి అర్ టి యూ అభ్య‌ర్ధి గాదె శ్రీనివాసులు నాయుడు త‌న స‌మీప అభ్య‌ర్ధి పాకలపాటి రఘువర్మకంటే 360 ఓట్ల ఆధీక్యంలో ఉన్నారు.. ఓట్ల లెక్కింపు నిబంధ‌న ప్ర‌కారం ఏ ఒక్క అభ్య‌ర్ధికి పోలైన ఓట్ల‌లో 50 శాతం రాలేదు.. దీంతో రెండో ప్రాధాన్య‌త ఓట్ల లెక్కింపును ప్రారంభించారు.

కాగా, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో ప‌ది మంది అభ్యర్థులు ఉన్నారు. కోసూరు రాధాకృష్ణ, పాకలపాటి రఘువర్మ, సత్తలూరి శ్రీరంగ పద్మావతి, కోరెడ్ల విజయ గౌరీ, నూకల సూర్యప్రకాశ్, రాయల సత్యనారాయణ, గాదె శ్రీనివాసులు నాయుడు, పోతల దుర్గారావు, పెదపెంకి శివప్రసాద్, సుంకర శ్రీనివాసరావు లు పోటీ ప‌డుతున్నారు.

Leave a Reply