9 IT COMPANYS | విశాఖలో దిగ్గ‌జ కంపెనీలు..

9 IT COMPANYS | విశాఖలో దిగ్గ‌జ కంపెనీలు..

  • ఐటీ మంత్రి నారా లోకేష్
9 IT COMPANYS

9 IT COMPANYS | విశాఖ‌, ఆంధ్ర‌ప్ర‌భ : విశాఖ- కాగ్నిజెంట్ సహా 9 ఐటీ కంపెనీల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఐటీ మంత్రి నారా లోకేష్ (It Minister Nara Lokesh) ప్రసంగించారు. అంతర్జాతీయ స్థాయి దిగ్గజ ఐటీ కంపెనీ విశాఖలో అడుగుపెట్టటం చారిత్రాత్మక మైలురాయి అని ఆయ‌న అన్నారు. విజన్ వాస్తవ రూపం దాలిస్తే కాగ్నిజెంట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు మారతాయ‌న్నారు. 2025లో దావోస్ కలిసి కాగ్నిజెంట్ ను విశాఖకు ఆహ్వానించామ‌న్నారు. ఇప్పుడు మళ్లీ దావోస్ కు వెళ్లకముందే ఆ సంస్థ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించింద‌ని తెలిపారు. నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసింద‌న్నారు. ప్రోత్సాహకంగా ఎకరా భూమిని 99 పైసలకు ఇస్తామని వారికి హామీ ఇచ్చామ‌న్నారు. చెప్పిన‌ట్లే వారికి భూమి ఇచ్చామ‌న్నారు. సీఎం చంద్రబాబు రియల్ టైమ్ లో నిర్ణయాలు జరగాలని ఆశిస్తారన్నారు.

9 IT COMPANYS

ఆయన కేబినెట్ లో (Cabinet) మంత్రులందరం స్వేచ్ఛగా రాష్ట్ర అభివృద్ధికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. విశాఖపట్నం ఐటీ, జీసీసీ కేంద్రంగా మారుతుంద‌న్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ కూడా ఈ ప్రాంత అభివృద్ధిని మారుస్తుంద‌న్నారు. వై నాట్ వైజాగ్ అనే ప్రశ్న ఉదయించేలా ఐటీ కంపెనీలు, పరిశ్రమల్ని ఈ ప్రాంతానికి ఆహ్వానిస్తున్నామ‌న్నారు. ఆర్సెలార్ మిట్టల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఈ ప్రాంతానికి వస్తోంద‌న్నారు. గతంలో హైదరాబాద్ లో ఊరు చివరగా జూబ్లిహిల్స్ చెక్ పోస్టు ఉండేద‌ని, ఇప్పుడు అక్కడ చెక్ పోస్టు కాదు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలకు ప్రతీకగా మెట్రో స్టేషన్ ఉంద‌న్నారు.

9 IT COMPANYS

రాష్ట్రంలో పెట్టిన ప్రతీ ప్రాజెక్టునూ ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి చేయూత అందిస్తామని చెప్పామ‌ని, ఇప్పుడు కాగ్నిజెంట్ కు కూడా అదే స్థాయి ప్రోత్సాహం అందిస్తామ‌న్నారు. కాగ్నిజెంట్ లో పనిచేసే ఉద్యోగులంతా విశాఖ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాల‌న్నారు. 5 లక్షల ఐటీ ఉద్యోగాలు (IT Jobs) ఈ ప్రాంతానికి వచ్చేలా మా ప్రభుత్వం కృషి చేస్తుంద‌న్నారు. ప్రధాని నరేంద్ర మోదీ భారత్ ను అభివృద్ధిబాటలో నడుపుతుంటే ఏపీని సీఎం చంద్రబాబు నాయుడు పురోగతి బాట పట్టిస్తున్నారన్నారు. వారిరువురూ 25 ఏళ్ల వయస్సున్న యువకుల్లా దేశ, రాష్ట్రాభివృద్ధికి పనిచేస్తున్నారని నారా లోకేష్ అన్నారు.

9 IT COMPANYS

Leave a Reply