Seethakka | మేడారంలో మంత్రులు పొంగులేటి, సీతక్క పర్యటన
Seethakka | తాడ్వాయి, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కలు పర్యటించారు. గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ (Master Plan) లో భాగంగా చేస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గద్దెల చుట్టూ నూతనంగా నిర్మిస్తున్న గద్దెలను పరిశీంచారు. అనంతరం గద్దెల నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్మిస్తున్న సిసి రోడ్డు, గద్దెల నుంచి ఊరట్టం స్థూపం వరకు నిర్మింస్తున్న సిసి రోడ్డు పనులను, జంపన్న వాగులో స్నానఘట్టాలను పరిశీలించారు. ఈసందర్భంగా వానదేవతలను దర్శించుకున్నారు. ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రెగా కళ్యాణి, రవీ చందర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

