compartments | ఓటెత్తిన పల్లెలు
- సంగారెడ్డిలో సాఫీగా కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ
- పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య
compartments | సంగారెడ్డి, ఆంధ్ర ప్రభ : సంగారెడ్డి జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పల్లెల్లో ప్రజలు ఓటు వేయడానికి భారీగా పోలింగ్ కేంద్రాల(Polling centers)కు చేరుకుంటున్నారు. పోలింగ్ ఈ రోజు ఉదయం 7.00 గంటలకు కట్టుదిట్టమైన భద్రతా, పరిపాలన ఏర్పాట్ల నడుమ ప్రారంభమైంది. చలి తీవ్రతను లెక్క చేయకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.
పలు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి నిలబడడంతో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆమె పోలింగ్ బూత్లోని ఓటర్ కంపార్ట్మెంట్(compartments), బ్యాలెట్ బాక్స్ సీల్, పోలింగ్ ఏజెంట్ల హాజరు, క్యూలైన్ నిర్వహణ, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.




