Nomination | కత్తెరకు ఓటెయ్యండి.. కష్టాలు తీరుస్తా..

Nomination | కత్తెరకు ఓటెయ్యండి.. కష్టాలు తీరుస్తా..

Nomination | మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : తొలిసారిగా ప్రజాసేవకు అంకితమవుదామనే ఉద్దేశ్యంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో(election) పోటీ చేస్తున్నానని ఎన్నికల్లో ఆశీర్వదించాలని జాడీ రామస్వామి తెలిపారు. మంథని మండలం అరెంద గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని ఆమె తెలిపారు. ఈ ఎన్నికల్లో కత్తెరకు ఓటేసి తనను గెలిపిస్తే ప్రజల సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు.

తొలిసారిగా ఎన్నికల బరిలోకి నిలుస్తున్నానని, గ్రామస్తుల మద్దతు కూడగట్టుకోని, ప్రజల సహకారంతో నామినేషన్(Nomination) వేసినట్లు ఆయన తెలిపారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం జాడి రామస్వామికి అధికారులు(officials) కత్తెర గుర్తు కేటాయించారు.

గ్రామానికి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించడానికి సైతం అంకితభావంతో కృషి చేస్తారని స్పష్టం చేశారు. సర్పంచిగా అవకాశం కల్పిస్తే గ్రామ సమగ్రాభివృద్ధికి చేస్తానని ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.

Leave a Reply