India vs Pakistan – దుబాయ్ వెదర్, పిచ్ రిపోర్ట్
దుబాయ్ – భారత్ , పాకిస్తాన్ మధ్య జరిగే ఉత్కంఠభరిత మ్యాచ్ కోసం ఎదురుచూపులు ముగియబోతున్నాయి. నేడు దుబాయ్ మైదానంలో మధ్యాహ్నం 2.30 కి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్ లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
వెదర్ రిపోర్ట్
ప్రస్తుతం అక్కడ 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉందనీ అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది.మబ్బులేం లేకుండా.. ఆకాశమంతా చాలా క్లియర్గా ఉంది. సో వర్షం వచ్చే అవకాశం లేదు. అలాగే ఈ రోజు అక్కడ రోజు ఉండేంత వేడి ఉండకపోవచ్చు. కాస్త చల్లగానే ఉంటుండటంతో రాత్రి పూట డ్యూ కూడా రాదని వాతావరణ నిపుణులు అంటున్నారు.
ఇది టాస్ సమయంలో కీలకంగా మారే అంశం. టాస్ గెలిస్తే ముందు ఏం చేయాలనే డ్యూ వస్తుందా? రాదా? అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. పగలు ఎక్కువ వేడిగా ఉంటే రాత్రి డ్యూ వస్తుంది. పగలు చల్లగా ఉంటే రాత్రి డ్యూ రాదు. సో దుబాయ్లో ఈ రోజు డ్యూ వచ్చే ఛాన్స్ తక్కువ. బంగ్లాదేశ్తో 20వ తేదీన జరిగిన మ్యాచ్లోనూ టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డ్యూ రాలేదు. సో ఈ రోజు కూడా డ్యూ రాని అవకాశం ఎక్కువగా ఉండటంతో ఒక వేళ రోహిత్ శర్మ టాస్ గెలిస్తే మాత్రం ముందు బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇక పిచ్ రిపోర్ట్కి వచ్చేస్తే..
బంగ్లాదేశ్తో మ్యాచ్లో ఉన్నట్లే ఇప్పుడు కూడా స్లో పిచ్ ఉంటుందని సమాచారం. ముందుగా పేసర్లకు, ఆ తర్వాత స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. మిడిల్డార్ బ్యాటర్లకు ఈ పిచ్పై బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. చాలా ఓపికతో బ్యాటింగ్ చేస్తేనే పరుగులు వస్తాయి. పవర్ ప్లేలో మాత్రం వేగంగా పరుగులు చేయాలి.
ఇక టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ విషయానికి వస్తే..
కుల్దీప్ యాదవ్ను పక్కనపెట్టి వరుణ్ చక్రవర్తి ఆడించే అవకాశం ఉంది. అలాగే అర్షదీప్ సింగ్ కూడా ప్లేయింగ్ ఎలెవన్లోకి వస్తాడని కూడా సమాచారం. మొత్తంగా భారత ప్లేయింగ్(అంచనా) ఈ విధంగా ఉండే అవకాశం ఉంది.. రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్/ వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా/అర్షదీప్ సింగ్