Gold Price | ఊహించని షాక్.. పసిడి రన్!
- చెదిరిపోతున్న బంగారం కల
వెబ్ బిజినెస్ డెస్క్, ఆంధ్రప్రభ : బంగారం కొనుగోలు చేయాలనే కల మళ్లీ చెదిరిపోతుంది. గత కొంత కాలంగా పసిడి రేటు తగ్గుముఖం పట్టింది. ఇంకా తగ్గే అవకాశం ఉందని ఆశించే పసిడి ప్రియులకు ఈరోజు షాక్ ఇచ్చింది.
పది గ్రాముల బంగారంపై రూ.2,290 పెరిగింది. నిన్న పసిడి ధర తగ్గింది. నిన్న తులం బంగారంపై రూ.330 తగ్గింది. ఇటీవల బంగారం ధరలు వరుసగా పెరుగుతూ లక్షా 35 వేలకు చేరువైంది. అనంతరం వరుసగా తగ్గుతూ లక్ష 22 వేలకు చేరింది.
పసిడి ధరలు తగ్గాయని సంతోషించే లోపే మళ్లీ షాక్ ఇస్తున్నాయి. నవంబర్ 10, 11 తేదీల్లో భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. నిన్న స్వల్పంగా తగ్గాయి. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల ఒక గ్రాము పసిడి ధర రూ.229 పెరిగి.. రూ.12,780 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.210 పెరిగి.. 11,715గా కొనసాగుతోంది.

Gold Price | బులియన్ మార్కెట్లో ..
బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,27,800గా.. 22 క్యారెట్ల ధర రూ.1,17,150గా నమోదయింది. నిన్నటితో పోల్చుకుంటే 24 క్యారెట్లపై రూ.2,290.. 22 క్యారెట్లపై రూ.2,100 పెరిగింది.
Gold Price | హైదరాబాద్ మార్కెట్లో..
హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.1,27,800 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల పది గ్రాముల రేటు రూ.1,17,150గా పలుకుతోంది. విశాఖ, విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
వెండి ధర…
వెండి ధర మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా రూ.పది వేలకు పెరిగింది. ఈ రోజు బులియన్ మార్కెట్లో కిలో వెండిపై రూ.10,000 పెరిగి.. రూ.1,72,000 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ నగరంలో కిలో వెండి రూ.1,82,000గా నమోదైంది. విశాఖ, విజయవాడలో కూడా రూ.1,82,000గా కొనసాగుతోంది.

