Vikarabad | అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..

భార్య, మామలను అదుపులోకి తీసుకున్న పోలీసులు


తాండూరు రూరల్, ఆంధ్రప్రభ : వికారాబాద్ (Vikarabad) జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ (Malkapur) గ్రామంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితి (Suspicious situation)లో మృతి చెందాడు. ఈ సంఘటన ఇవాళ‌ వెలుగులోకి వచ్చింది.

స్థానికులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు… గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకట్ (Reddypalli Venkat) ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కాగా భార్య జయశ్రీ (Jayashree), ఆమె తండ్రి కలిసి వెంకట్ ను హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు భార్య, తండ్రిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న రూరల్ సీఐ నగేష్‌, కరణ్‌ కోట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యప్తు ప్రారంభించారు. అయితే వ్యక్తి హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గ్రామంలో ఈ సంఘటన కలకలం రేపింది.

Leave a Reply