న్యూ ఢిల్లీ – సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు ప్రధాని మోదీ. ఈ ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తునట్లు చెప్పారు. కాగా, మృతుల బంధువులకు ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50,000 ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
PM | సిగాచీ బ్లాస్ట్ బాధితులకు ప్రధాని సంతాపం – మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నష్టపరిహారం
