- ఒర్వకల్లో రూ.1,622 కోట్లతో రిలయన్స్ బీవరేజెస్ యూనిట్
కర్నూలు : రాయలసీమ పారిశ్రామిక రూపాంతరానికి కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ రూ.1,622 కోట్ల వ్యయంతో బీవరేజెస్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ సంస్థకు 80 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
ఈ బేవరేజెస్ యూనిట్లో కార్బొనేటెడ్ డ్రింక్స్, జ్యూస్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వంటివి ఉత్పత్తి చేయనున్నారు. ఈ పరిశ్రమ 2026 డిసెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించనుంది.
ఈ యూనిట్ ద్వారా 1,200 మందికి పైగా స్థానిక యువతకు ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయని మంత్రి లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రాయలసీమలో పారిశ్రామిక విప్లవానికి బీజాలు పడ్డాయని ఆయన అన్నారు.
ఇది కేవలం ఒక పరిశ్రమ స్థాపన మాత్రమే కాదని… రాయలసీమలో పెట్టుబడులకు నాంది పలికే మలుపు అని నారా లోకేష్ అన్నారు. ఈ రిలయన్స్ యూనిట్ రాయలసీమ పారిశ్రామిక భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ చోరవతో భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించగలమని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.