వెలగపూడి : పల్నాడు (Palnadu) జిల్లా పర్యటనలో భాగంగా రెంటపాళ్ల (Rentapalla) గ్రామంలో సింగయ్య మృతికి కారణం మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అంటూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court)లో లంచ్ మోషన్ పిటిషన్ (Lunch Motion Petition) దాఖలు చేయగా.. నిన్న విచారణ చేయాల్సి ఉండగా నేటికి వాయిదా వేశారు.
ఈ మేరకు ఇవాళ మరోసారి పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో నిందితులపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేస్తున్నట్లుగా న్యాయమూర్తి వెల్లడించారు. కాగా, ఇదే కేసులో జగన్తో పాటు కారు డ్రైవర్ రమణారెడ్డి, పీఏ నాగేశ్వర్ రెడ్డి, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిని నిందితులుగా చేర్చారు.