Chennur | సమస్యల పరిస్కారానికి ప్రభుత్వం కృషి : మంత్రి వివేక్

చెన్నూర్, అంధ్రప్రభ : ప్రజల సమస్యలు నేరుగా విని వెనువెంటనే పరిష్కరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం చిత్తశుద్ధితో వ్యాహరిస్తుందని రాష్ట్ర కార్మిక గనులశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి (Gaddam Vivek Venkataswamy) అన్నారు. ఇవాళ‌ ఉదయం మంత్రి వివేక్ తన స్వంత నియోజక వర్గ కేంద్రమైన చెన్నూర్ (Chennur) క్యాంప్ కార్యాలయంలో ప్రజలతో ముఖాముఖీ భేటీ నిర్వహించారు.

ఈ సందర్బంగా పలు గ్రామాలునుంచి వచ్చిన ప్రజలు తాగునీటి, రహదారుల మారమ్మత్తులు, ఫింఛన్లు, భూ సంబంధిత సమస్యలు పరిష్కరించాలని వినతులను అందజేశారు. వినతులు (Requests) పరిశీలించిన మంత్రి సంబంధిత శాఖల అధికారులకు వెంటనే సమస్యలు పారష్కరించాలని ఆదేశించారు. ముందుగా చెన్నూరు పోలీసులు మంత్రి వివేక్ కు క్యాంప్ కార్యాలయంలో గౌరవ వందనం చేశారు.

Leave a Reply