పెద్దపల్లి, ఆంధ్రప్రభ : వాహనదారులందరూ రవాణా శాఖ నిబంధనలు కచ్చితంగా పాటించాలని పెద్దపల్లి (Peddapalli) ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ అనిల్ తెలిపారు. విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలను తెలియజేసేందుకు పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులతో పాటు గాయత్రి పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు.
ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని విద్యార్థులచే ప్లకార్డులు చేత పట్టించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల (Road accidents) నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రథమ చికిత్స లాంటి అంశాలను తెలియజేశారు. వాహనదారులు ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండకపోతే జరిమానాలు వేస్తామని, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి జరిమానాలతో పాటు జైలుశిక్ష కూడా పడుతుందన్నారు.