ADB | పిడుగుపాటుతో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకుంటాం : ఎమ్మెల్యే

ఉట్నూర్, జూన్ 13 (ఆంధ్రప్రభ) : ఆదిలాబాద్ (Adilabad) జిల్లా గాదిగూడా మండలంలోని పిప్పిరి గ్రామంలో నలుగురు, బేల మండలంలోని సొన్నాస్, సాంగ్వీడి గ్రామంలో ఇద్దరు పిడుగుపాటుతో మృతిచెందటం దురదృష్టకరమని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గాదిగూడా, బేల మండలాల్లో పిడుగుపాటు (thunderbolt) తో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందటం తీవ్రంగా కలిచివేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వర్షాలు కురుస్తున్న సమయంలో రైతులు పంట పొలాల‌కు వెల్లకూడదని సూచించారు. రిమ్స్ ఆసుపత్రి (Reims Hospital)లో పిడుగుపాటుతో తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని డాక్టర్లకు ఆదేశించినట్లు ఎమ్మెల్యే (MLA) తెలిపారు. మృతుల పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *