భారత యువ క్రికెట్ స్టార్ రింకు సింగ్ (Rinku Singh) జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రింకు సింగ్ సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ప్రియా సరోజ్ (Priya Saroj) తో నిశ్చితార్థం (Engagement) చేసుకున్నారు.
ఈ ఏడాది నవంబర్ 18న వారణాసి (Varanasi)లో రింకు, ప్రియల జంట వివాహ బంధంతో ఒక్కటవనున్నారు. ఈ వేడుక కూడా అంగరంగ వైభవంగా జరగనుంది.
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన అంగరంగ వైభవంగా జరిగిన నిశ్చితార్థం, రాజకీయ, క్రికెట్, సినీ ప్రముఖుల హాజరుతో ఒక హైప్రొఫైల్ ఈవెంట్గా మారింది.
రింకూ – సాధారణ ఆటగాడి నుంచి స్టార్ క్రికెటర్ దాకా
రింకూ సింగ్ అలీగఢ్కు చెందిన ఆటగాడు. కోల్కతా నైట్రైడర్స్ తరఫున ఐపీఎల్లో అదిరిపోయే ఆటతీరుతో దేశవ్యాప్తంగా అభిమానుల మనసు గెలుచుకున్నాడు. 2023లో గుజరాత్ పై అయిదు బంతుల్లో అయిదు సిక్సర్లు కొట్టి టీ20 క్రికెట్లో తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టులో కూడా స్థిరమైన ఆటగాడిగా ఎదిగాడు.
ప్రియా – రాజకీయ రంగపు యువ నేత
ప్రియా సరోజ్, దేశంలో అత్యంత చిన్న వయసులో ఎంపీగా ఎన్నికైన నేతలలో ఒకరు. ఆమె 2024లో మచ్లీషహర్ నియోజకవర్గం నుంచి SP టికెట్పై విజయం సాధించారు. అమిటీ యూనివర్సిటీ నుంచి LLB పూర్తిచేసిన ఆమె, ఢిల్లీ సుప్రీంకోర్టులో అడ్వొకేట్గా సేవలందించారు. తండ్రి తుఫాని సరోజ్ కూడా రాజకీయంగా ప్రాచుర్యం పొందిన నేత.