హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ను వివరించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “మన దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు నేను నా నివాళులు అర్పిస్తున్న “అని అన్నారు. ఇంత ధైర్యంగా ఉండి దేశాన్ని రక్షించినందుకు సాయుధ దళాలను కూడా తాను అభినందిస్తున్నాను అని అన్నారు. ఈ మొత్తం కాల్పుల విరమణ ఫలితం భారతదేశం- పాకిస్తాన్ మధ్య శాంతి అయితే.. మనం దానిని స్వాగతించాలన్నారు.
కానీ అది భారతదేశం-పాకిస్తాన్ మధ్య అమెరికా జోక్యం ముందుకు సాగితే.. మనం చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలన్నారు. ఈ సమస్యలన్నింటినీ మన భారతీయులందరికీ సంక్లిష్టంగా, వివరంగా వివరించడానికి, కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తాను గట్టిగా అభ్యర్థిస్తున్నాను అని చెప్పారు.