ADB | అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఉట్నూర్, ఏప్రిల్ 24 (ఆంధ్రప్రభ) : అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని సుద్దగూడ గ్రామంలో 39ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్నీ ప్రారంభించిందన్నారు. నిజమైన లబ్ధిదారులకు 100శాతం ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. అనంతరం గ్రామంలోని భావిని పరిశీలించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో బోర్లు వేసి, ప్రజల దాహార్తిని తీరుస్తున్నామని తెలిపారు.

ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉట్నూర్ మండల అధ్యక్షులు అబ్దుల్ ఖయ్యూం, ఆదిలాబాద్ ఆర్టీఏ సభ్యులు దూటరాజేశ్వర్, జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జై వంతరావు, లక్కారం మాజీ సర్పంచ్ మరుసకొల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్తపెళ్లి మహేందర్, తిరుపతి, ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి ఉప్పుల సత్యనారాయణ, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *