18thJuneeditorial | భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించిన ట్రంప్

18thJuneeditorial | భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించిన ట్రంప్

18thJuneeditorial | హార్మూజ్ జలసంధి, ఇరాన్ అంశాలపై కీలక చర్చ
భద్రతా సహకారం, వాణిజ్య ఒప్పందంపై ఆశావహ సంకేతాలు
భారత్‌కు యూఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి మద్దతు

18thJuneeditorial | అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. త్వరలోనే ఇరు దేశాల వాణిజ్య ఒప్పందం ఖరారు అవుతుందన్నారు. ఈ ఇద్దరు నాయకులు ఫ్రాన్స్‌లో బుధవారం సమావేశమై ఇరు దేశాలకు ఆసక్తి ఉన్న అనేక ప్రధానాంశాలపై చర్చించారు.

హార్మూజ్ జలసంధిని తెరిపించడానికి ట్రంప్ విశేషంగా కృషి చేశారని మోదీ ప్రశంసించారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరడం వల్ల ప్రపంచంలోని అన్ని దేశాలకు మేలు జరుగుతుందని అన్నారు. మోదీ భారత ప్రధానిగా ఉన్నంత కాలం భారత్‌పై ఎవరైనా దాడికి ప్రయత్నిస్తే అమెరికా అండగా ఉంటుందని ట్రంప్ హామీ ఇచ్చారు. తాము జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని చెప్పారు.

బేరసారాల విషయంలో మోదీ చాలా నిక్కచ్చిగా ఉంటారని, అందుకు ఆయనను అభినందిస్తున్నానని ట్రంప్ అన్నారు. హార్మూజ్ వద్ద భారత సైనికులకు భద్రత కల్పించాలన్న మోదీ అభ్యర్థనపై ట్రంప్ స్పందిస్తూ, నౌకాదళ భద్రత విషయంలో కలిసి పనిచేస్తామని, భారత్‌కు అన్నివేళలా అండగా ఉంటామని తెలిపారు.

త్వరలోనే తాను భారత్‌లో పర్యటించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ యుద్ధం ఓ చరిత్ర అని అన్నారు. ఇకపై తాను ఉక్రెయిన్ యుద్ధంపై దృష్టి సారిస్తానని ప్రకటించారు. ఇరాన్ విషయంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన పని ఉండదన్నారు. మోదీతో ముఖాముఖి సంభాషించడం 16 నెలల్లో ఇదే మొదటిసారి. మోదీ భుజంపై చేయివేసి వెన్ను తట్టారు. ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు అనే పద్ధతి నుంచి సమాన ప్రాతిపదికపై ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకోవాలని అన్నారు.

అంతర్జాతీయ భాగస్వామ్యాల్లో విశ్వసనీయతకు ప్రాధాన్యం పెరిగిందని, మోదీ విశ్వసనీయతకు ప్రాధాన్యం ఇస్తున్నారని ట్రంప్ అన్నారు. సంకుచిత ప్రయోజనాల కోసం వాణిజ్యాన్ని, సాంకేతికతను వినియోగించుకోవడం వల్లనే ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. సదవగాహన, సమయస్ఫూర్తి, సానుకూల దృక్పథంతో సమస్యలు పరిష్కారమవుతాయని, అందుకు దోహదం చేయడంలో మోదీ ప్రదర్శిస్తున్న స్ఫూర్తి గొప్పదని అన్నారు.

జి-7 కూటమిలో భారత్‌కు సభ్యత్వం లేకపోయినా, సదస్సు సందర్భంగా సమాన గౌరవం, ప్రతిపత్తి లభించాయని చెప్పారు. జి-7 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు భారత్‌కూ వర్తిస్తాయని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్న డిమాండ్‌కు ఫ్రాన్స్‌కు వచ్చే ముందు స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినీ మద్దతు ప్రకటించారు. భారత్ ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశంగా పరిణామం చెందిందని, అంతర్జాతీయ సమస్యల పరిష్కారంలో పాలు పంచుకుంటోందని పేర్కొన్నారు. అందువల్ల భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.

ఫ్రాన్స్ ప్రధాని మార్క్ కార్నీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పరస్పర సంప్రదింపుల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని, అందుకు భారత్ అనుసరిస్తున్న విధానమే అన్ని దేశాలకూ ఆదర్శప్రాయమని అన్నారు.