టీజీఐఐసీ కార్యాలయం ప్రారంభించిన మంత్రులు

టీజీఐఐసీ కార్యాలయం ప్రారంభించిన మంత్రులు
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: సంగారెడ్డి పట్టణంలోని ఆదర్శ్ నగర్లో టీజీఐఐసీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నూతన కార్యాలయంలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలజగ్గారెడ్డిని నూతన కార్యాలయంలోని కుర్చీలో కూర్చోబెట్టారు. మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, సెట్విన్ ఛైర్మన్ గిరిధర్ రెడ్డి, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ ఆర్.విఠల్, డిప్యూటీ జోనల్ మేనేజర్ అధికారులు ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డికి అభినందనలు తెలిపారు.
