ipl2026final | బీసీసీఐ నిర్ణయం
ipl2026final | బీసీసీఐ నిర్ణయం
ipl2026final | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ను గుజరాత్ లోని అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ నెల 31న ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రూల్స్ ప్రకారం గత సీజన్ లో కప్ కొట్టిన జట్టు హోం టౌన్ లోని స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించటం ఆనవాయితీ. ఆ లెక్కటన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించాల్సి ఉంది. కానీ, బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట జరగటం.. ఆ తర్వాత మ్యాచ్ టికెట్ల అమ్మకంలో వివాదాల కారణంగా ఫైనల్ మ్యాచ్ వేదికను బీసీసీఐ మార్చింది. బెంగళూరులో కాకుండా అహ్మదాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించారు.
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1: మే 26, 2026, ధర్మశాల (హిమాచల్)
ఎలిమినేటర్ 2: మే 27, 2026, క్వాలిఫయర్ 2: మే 29, 2026, ముల్లన్పూర్ (పంజాబ్లో)
