హైదరాబాద్: కృష్ణ భగవానుడికి ప్రతిరూపంగా భావించే శ్రీ చైతన్య మహాప్రభువు 539వ ఆవిర్భావ తిథి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ అత్తాపూర్ లోని ఇస్కాన్ ఆలయం ఈ సందర్భంగా హరే కృష్ణ నామ జపంతో మార్మోగిపోయింది.
దాదాపు 5వేల మందికి పైగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జయంతి ఉత్సవాల్లో భాగంగా ఉదయం 7.30 గంటలకు దర్శన హారతి నిర్వహించారు.8 గంటల నుంచి శ్రీ చైతన్య మహాప్రభు లీలలపై ఆధ్యాత్మిక ప్రవచనాలు జరిగాయి. సాయంత్రం 5.30 గంటలకు మహా అభిషేకం, ఆరున్నరకు చప్పన్ భోగ్ నైవేద్యం, 7 గంటలకు గౌర హారతి ఇచ్చారు. 7.30 గంటల నుంచి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు.
