వెలగపూడి – ముంబై నటి కాదంబరీ జత్వానీ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతి రానా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ సస్పెన్షన్ ను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. 2025 సెప్టెంబర్ 25 వరకూ వారి సస్పెన్షన్ పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రివ్యూ కమిటీ సిఫార్సుల అనంతరం ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ను పొడిగిస్తున్నట్టుగా ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈ అధికారులు ముగ్గురు అఖిల భారత సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించారని వారిపై అభియోగాలు ఉన్నాయి.
AP | జత్వానీ వేధింపుల కేసు – ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు
