4-killed : న‌లుగురు అక్క‌డిక్క‌డే Andhra Prabha Sad News

4-killed : న‌లుగురు అక్క‌డిక్క‌డే Andhra Prabha Sad News

  • విశాఖ‌లో ఘోర ప్ర‌మాదం
  • వెనుక నుంచి లారీని ఢీకొట్టన కారు
  • న‌ర‌స‌రావుపేట ఎమ్మెల్యే పీఏకి తీవ్ర‌గాయాలు

( ఆనందపురం / విశాఖపట్నం బ్యూరో, ఆంధ్రప్రభ ):

4-killed : విశాఖ‌ప‌ట్నం జిల్లా ఆనందపు మండలంలోని రం పెందుర్తి రోడ్డుల‌లోని సత్తరువు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఆదివారం వేకువ జామున ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా, నరసరావుపేట నుండి టెక్కలి వైపు వస్తున్న ఏపీ 40 కె ఎం -1467 నంబరు గల ఒక కారు (కియా కేరెన్స్), సత్తరువు ఫ్లైఓవర్ బ్రిడ్జి చేరుకున్న స‌మ‌యంలో ఎదురుగా వెళ్తున్న ఒక గుర్తు తెలియని లారీని వెనుక నుండి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు.

మిగిలిన ఒక ప్రయాణికుడు గాయపడగా, అతడిని విశాఖ క్యూ1ఆసుపత్రికి తరలించారు.ఈకారులో ఉన్న నరసరాపుపేట ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో చంద్రశేఖర్ కుమారుడు ఉన్నట్లు తెలుస్తోంది.

విశాఖపట్నం జిల్లా ఆనందపురం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబుకు చెందిన అమూల్య నర్సింగ్ హోమ్ మేనేజర్ చంద్ర తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చంద్ర కుమారుడు కూడా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందింది.పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం పెందుర్తి నుంచి ఆనందపురం వైపు వెళ్తున్న కారు సత్తారువు జంక్షన్ సమీపంలో ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన చంద్రను స్థానికులు, పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు హుటాహుటిన విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లినట్లు తెలిసింది.ఆనందపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విశాఖపట్నంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలుసుకున్న విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏడీసీపీ) అన్నపు నరసింహమూర్తి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) అప్పలరాజు కూడా ఆయనతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని, సహాయక చర్యలపై ఆరా తీశారు.