బూర్గంపాడు 6 ఏప్రిల్ (ఆంధ్రప్రభ):తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో సారపాక లోని బిపిఎల్ హెలిపాడ్ లో 11 గంటలకు విచ్చేశారు. తెలంగాణ రాష్ట్రం మంత్రివర్యులు వ్యవసాయ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు , మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్, మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులు ఆయనను ఘనంగా స్వాగతం పలికారు. భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మండపానికి బయలుదేరారు.
ఐటీసీ గెస్ట్ హౌస్ కి సీఎం రేవంత్ రెడ్డి…

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు ఐటిసి బిపిఎల్ స్కూల్ ప్రాంగణంలో హెలికాప్టర్ ద్వారా దిగి అక్కడి నుంచి ఐటీసీ గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. ఐటీసీ గెస్ట్ హౌస్ లో సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు అధికారులు ఘనస్వాగతం పలికారు.
అక్కడనుండి భద్రాచల సీతారామ చంద్ర స్వామి వారి కళ్యాణానికి బయలుదేరారు. ఆయన వెంట కుటుంబ సభ్యులతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీ బలరాం నాయక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ గౌరవ వందన స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి

పినపాక/బూర్గంపాడు, ఏప్రిల్ 6, (ఆంధ్రప్రభ న్యూస్): భద్రాచలం సీతారామచంద్రస్వామి కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి బిపిఎల్ గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. అక్కడ పోలీసులు సమర్పించిన గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు .