శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత..
శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత..
వరంగల్ క్రైమ్, ఆంధ్ర ప్రభ : వరంగల్ నగర పోలీసు కమిషనర్గా ఎన్. శ్వేతారెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. హనుమకొండలోని ప్రధాన కార్యాలయంలో ఇప్పటివరకు ఆ ఉన్నత స్థానంలో సేవలందించిన సన్ ప్రీత్ సింగ్ నుంచి ఆమె లాంఛనప్రాయంగా అధికార బాధ్యతలు స్వీకరించారు . విధుల్లో చేరిన ఉన్నతాధికారిణికి తోటి అధికారులు, కిందిస్థాయి సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం జిల్లా పరిధిలో నిత్యం శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. సామాన్యులకు భరోసా కల్పిస్తూ, వాళ్లకు మరింత చేరువయ్యేలా పారదర్శకమైన రక్షణ సేవలను పకడ్బందీగా అమలు చేయడంపై పూర్తి దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు.
