తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనార్థం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు మాత్రమే తాత్కాలికంగా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈనెల 15వ తేదీ నుండి సదరు నేతల సిఫార్సు లేఖలను మాత్రమే టీటీడీ అనుమతించనుంది. అయితే మిగిలిన వారి సిఫార్సు లేఖలపై అంతకు ముందు తీసుకున్న నిర్ణయం కొనసాగుతుంది. నియమావళి ప్రకారం అనుమతి పొందిన భక్తులకు ఈనెల 16వ తేదీ నుండి శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.
Tirumala | ఏపీ, తెలంగాణ నేతల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు తాత్కాలిక నిర్ణయం : టీటీడీ
