హైదరాబాద్ – జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆ పరీక్ష ఫీజు చెల్లింపునకు మే 16 వరకు గడువు ఇచ్చారు. ఇక ఒక్కో సబ్జెక్ట్ రీకౌంటింగ్కు రూ.500, రీ వెరిఫికేషన్కు రూ.1000 చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు మే 15 వరకు అవకాశం కల్పించారు.
రెసిడెన్షియల్ స్కూళ్ల ఫలితాలు భేష్
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 98.2శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. రెసిడెన్షియల్ స్కూళ్లలో 98.7 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి అనూహ్యంగా ప్రైవేటు స్కూళ్ల కంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో అత్యధిక ఉత్తీర్ణ శాతం నమోదు కావడం విశేషం. బాలురు 91.32 శాతం, బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. 4,629 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణతను సాధించాయి. 99.29 శాతంతో మహబూబాబాద్ జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది. 73.97 శాతంతో చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా ఉంది.