ఖమ్మం నగర చరిత్రలో అతిపెద్ద మౌళిక ప్రాజెక్టులు…
ఖమ్మం నగర చరిత్రలో అతిపెద్ద మౌళిక ప్రాజెక్టులు…
- అభివృద్ధికి కేరాఫ్ మంత్రి తుమ్మల
- రాష్ట్రంలోనే ఖమ్మం నగరంకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మంత్రి
- వందల కోట్లతో ఖమ్మం అభివృద్ధి పరుగులు
- వేసవిలో నీటి ఎద్దడి, కరెంటు కోతలు లేకుండా చేసిన తుమ్మల
- అభివృద్ధికి మారుపేరుగా తుమ్మల హయాం
- కేబుల్ బ్రిడ్జి.. కరకట్ట నిర్మాణం
- మంత్రి తుమ్మల పనితీరుకు నిలువెత్తు నిదర్శనాలు
- త్రీటౌన్లో మీడియా సమావేశంలో నేతల విశ్లేషణ
- రూ.180 కోట్ల కేబుల్ బ్రిడ్జి పనులు తుదిదశలో 8.5 కి.మీ మున్నేరు ప్రొ-టె-క్షన్ వాల్కు భారీ వ్యయం
- ట్రాఫిక్, వరద సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగా అడుగులు
- వర్షాకాలానికి ముందే పనుల పూర్తి లక్ష్యం
- ఖమ్మం నగర రూపురేఖలు మారనున్నాయని నేతల అభిప్రాయం
- విలేకరుల సమావేశంలో త్రీ టౌన్ కార్పొరేటర్లు వెల్లడి
ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం నగర అభివృద్ధి చరిత్రలో కేబుల్ బ్రిడ్జి, మున్నేరు ప్రొ-టె-క్షన్ వాల్ ప్రాజెక్టులు అత్యంత కీలక మైలురాళ్లుగా నిలుస్తాయని త్రీ టౌన్ కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. త్రీటౌన్ పరిధిలోని కేబుల్ బ్రిడ్జి ఆవరణలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో త్రీ టౌన్ కార్పొరేటర్లు కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ, రుద్రగాని శ్రీదేవి ఉపేందర్, కొప్పెర సరిత ఉపేందర్, తోట ఉమారాణి వీరభద్రం, ధనాల రాధ, డోన్వాన్ సరస్వతి రవినాయక్లు ఈ అంశాలను వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ స్థాయిలో నిధులు కేటాయించి ఈ ప్రాజెక్టులను చేపట్టడం విశేషమని పేర్కొన్నారు. నగర భవిష్యత్తును మార్చే సామర్థం ఈ ప్రాజెక్టులకు ఉందని వివరించారు. ప్రజల భద్రత, సౌకర్యాల దృష్ట్యా వీటిని అత్యున్నత ప్రాధాన్యంతో అమలు చేస్తున్నట్లు- తెలిపారు. ప్రణాళికాబద్ధంగా పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఖమ్మం నగరాన్ని ఆధునిక నగరంగా తీర్చిదిద్దడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనాలు చేకూరేలా ఈ పనులు చేపట్టినట్లు- తెలిపారు.అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారని వారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం నగరానికి ప్రత్యేక గుర్తింపు తుమ్మల హయాంలో వచ్చిందని గుర్తు చేశారు. వేల కోట్ల రూపాయలతో ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధిని, త్రీ టౌన్ ప్రాంత అభివృద్ధిని పరుగులు పెట్టించారని అన్నారు.నగరంలో పార్కులు, సీసీ రోడ్లు, ఎటు చూసినా అభివృద్ధే కనిపిస్తోందని అది తుమ్మల మార్క్ పాలనకు గుర్తింపు అని అన్నారు. గత హయాంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీని ఖమ్మం నుంచి తరలించాలనే బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు చేసిందని అటువంటి దశ నుంచి త్రీ టౌన్కు ప్రధాన వనరుగా ఉన్న మార్కెట్ను అదే ప్రాంతంలో ఉంచి రూ. 150 కోట్లతో మార్కెట్ అభివృద్ధి చేశారని 80వేల బస్తాల కెపాసిటి ఉన్న ఖమ్మం మార్కెట్ను 2 లక్షల బస్తాలు నిల్వ ఉంచే స్థాయికి తీసుకొచ్చిన ఘనత తుమ్మల నాగేశ్వరరావుకు చెందుతుందన్నారు. మార్కెట్ చుట్టూ రూ. 14 కోట్లతో 70 అడుగుల రోడ్ల వెడల్పు నిర్మాణం చేపట్టిన ఘనత ఆయనకే చెందుతుందన్నారు. వెనుకబడిన తరగతుల వసతిగృహ నిర్మాణాల కోసం రూ. 9 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించారని అన్నారు. రైతులు నగరంలోకి వెళ్ళకుండా నేరుగా మార్కెట్కు వచ్చే విధంగా కోట్ల రూపాయలతో రోడ్లను నిర్మించారని గుర్తు చేశారు. సారధీనగర్లో రైల్వేఅండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసిన ఘనత తుమ్మలకే చెందుతుందని గుర్తు చేశారు. అమృత్ స్కీం కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరు చేసి ప్రాజెక్టును ప్రారంభించిన ఘనత ఆయనదేనన్నారు.
రూ.180 కోట్ల కేబుల్ బ్రిడ్జి ..
ఖమ్మం నగరానికి ప్రతీకగా నిలిచే కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి సుమారు రూ.180 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించబడినట్లు- నాయకులు వివరించారు. సుమారు 300 మీటర్ల పొడవుతో నిర్మితమవుతున్న ఈ బ్రిడ్జి నాలుగు లేన్లతో అత్యాధునిక సదుపాయాలతో రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఫుట్పాత్లు, డివైడర్ వంటి సౌకర్యాలతో ప్రజలకు సురక్షిత రాకపోకలు కల్పించేలా రూపకల్పన చేసినట్లు- చెప్పారు. ప్రస్తుతం పనులు తుదిదశకు చేరుకున్నాయని వెల్లడించారు. త్వరలోనే ప్రజలకు అందుబాటు-లోకి తీసుకురానున్నట్లు- తెలిపారు. ట్రాఫిక్ రద్దీ సమస్యను గణనీయంగా తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. నగర సౌందర్యాన్ని పెంచే ప్రతీకాత్మక నిర్మాణంగా ఇది నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే మౌలిక వసతిగా ఈ బ్రిడ్జి నిలవనుందని తెలిపారు.
మున్నేరు ప్రొ-టె-క్షన్ వాల్ ప్రాముఖ్యత :
మున్నేరు ప్రొ-టె-క్షన్ వాల్ నిర్మాణం ఖమ్మం నగర భద్రతకు కవచంగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు. మొత్తం 8.5 కిలోమీటర్ల పొడవున ఈ వాల్ నిర్మాణం కొనసాగుతోందని వివరించారు. వరద ముప్పును తగ్గించడంలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందని తెలిపారు. భారీ నిధులతో ఈ పనులు చేపట్టినట్లు- వెల్లడించారు. గతంలో వరదల వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టును ప్రాధాన్యంతో అమలు చేస్తున్నట్లు- చెప్పారు. వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టు-కున్నట్లు- తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు ఇది అత్యంత అవసరమని పేర్కొన్నారు. నగర భద్రతా వ్యవస్థలో ఇది కీలక భాగంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
వేగంగా సాగుతున్న పనులు :
కేబుల్ బ్రిడ్జి, మున్నేరు వాల్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని నాయకులు తెలిపారు. అధికారుల పర్యవేక్షణలో పనులు నిరంతరంగా జరుగుతున్నాయని వివరించారు. పనుల్లో ఎలాంటి ఆలస్యం చోటు-చేసుకోకుండా చర్యలు తీసుకుంటు-న్నట్లు- పేర్కొన్నారు. నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ నిర్మాణం కొనసాగుతున్నట్లు- తెలిపారు. అవసరమైన సాంకేతిక సదుపాయాలు వినియోగిస్తున్నట్లు- చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు నిర్వహిస్తున్నట్లు- వెల్లడించారు. పనుల పురోగతిపై తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నట్లు- తెలిపారు. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయడానికి కట్టు-బడి ఉన్నామని స్పష్టం చేశారు.
నగరాభివృద్ధికి కొత్త దిశ :
ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఖమ్మం నగర రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని నాయకులు అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. వరదల నుంచి నగరానికి శాశ్వత రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయని వివరించారు. పెట్టు-బడులను ఆకర్షించే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. నగరంలో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. ప్రజలకు సౌకర్యవంతమైన జీవనం అందించడమే లక్ష్యమని చెప్పారు. అభివృద్ధి దిశగా ఖమ్మం ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి పనులపై మీడియాకు పూర్తి వివరాలు అందించారు. ప్రజలకు పారదర్శకంగా సమాచారం అందించడం తమ బాధ్యత అని తెలిపారు. ఖమ్మం అభివృద్ధికి కట్టు-బడి పనిచేస్తున్నామని నాయకులు స్పష్టం చేశారు.
