Asian Games 2026 | ఆసియా క్రీడలకు భారత మహిళల జట్టును ప్రకటించిన బీసీసీఐ..

Asian Games 2026 | ఆసియా క్రీడలకు భారత మహిళల జట్టును ప్రకటించిన బీసీసీఐ..

కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్

Asian Games 2026 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: జపాన్‌లోని ఐచి–నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే 2026 ఆసియా క్రీడల కోసం భారత మహిళల క్రికెట్ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. కమిటీ ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. వరుసగా రెండోసారి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఈసారి దాదాపు పూర్తి బలగంతోనే టీమిండియా బరిలోకి దిగుతోంది. ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో ఆశించిన ఫలితం రాకపోయినా, ఖండాంతర క్రీడల్లో మళ్లీ సత్తా చాటేందుకు అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల సమ్మేళనంతో జట్టును ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది.

జట్టులో హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (ఉప కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమలిని (వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, నందిని శర్మలకు చోటు దక్కింది. శ్రేయాంక పాటిల్ ఎంపిక మాత్రం ఆమె ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుందని బీసీసీఐ తెలిపింది. అనుభవజ్ఞులతో పాటు యువ ప్రతిభకు కూడా అవకాశం కల్పించడం ద్వారా టైటిల్‌ను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా భారత జట్టు సిద్ధమవుతోంది.

భారత మహిళల జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (ఉప కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమలిని (వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, నందిని శర్మ, శ్రేయాంక పాటిల్ (ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి)