హైదరాబాద్ : ఇష్టం ఉన్నా లేకున్నా దేశ ప్రధాని మోదీనే అని.. కానీ ఆయన ప్రధానిలా ప్రవర్తించడం లేదని విమర్శించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ . దేశానికి ట్రంప్ డీ ఫ్యాక్టో ప్రధానిగా, మోదీ డీ ఆక్టివ్ ప్రధానిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కార్యదర్శి సాంబశివరావుతో కలసి విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ డీయాక్టివ్ ప్రధానిగా ఉండటం దురదృష్టకరమని చెప్పారు. దేశానికి ప్రధానికి మోదీయా లేక ట్రంప్ అని ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు. తల్లి దండ్రులు కష్టపడి మంచి భవిష్యత్ కోసం పిల్లలను విదేశాలకు పంపిస్తున్నారని, వారు అక్కడి నుంచి పంపించే డబ్బుపైనా 5 శాతం టాక్స్ పేరుతో దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్పై అమెరికా పైశాచికానందం పొందుతుందని విమర్శించారు. అమెరికా విధానాన్ని మోదీ ఎందుకు వ్యతిరేకించడం లేదన్నారు. ట్రంప్ యుద్ధం అపమంటే ఆపుతారు, కానీ అమెరికా ఆడుతున్న దోపిడి పైశాచికత్వాన్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. టెర్రరిస్టులను అడ్డంపెట్టుకొని మోదీ సొంత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా దేశం మొత్తం మద్దతు తెలిపితే.. మోదీ మాత్రం ట్రంప్కు జై కొట్టి, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు.
అందాల భామల చట్టు సొంగ కార్చకుంటూ తిరుగుతున్న మంత్రులు
హైదరాబాద్ నగరం అంతా అందాల భామల చుట్టే తిరుగుతున్నదని నారాయణ విమర్శించారు. రాష్ట్ర మంత్రులంతా అందాల భామల వెనుక సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారని మండిపడ్డారు. భామల కోసం కోట్లల్లో ఖర్చుపెట్టేది సొల్లు కార్చుకోవడానికా అని ప్రశ్నించారు.
ఆంధ్రకేసరికి నివాళి

టంగుటూరి ప్రకాశం పంతులు 69వ వర్ధంతి సందర్భంగా అసెంబ్లీ ముందు ఉన్న ఆయన విగ్రహానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు అర్పించారు… ఈ కార్యక్రమంలో దైవాజ్ఞ శర్మ, టంగుటూరి ప్రకాశం పంతులు వారసులు పాల్గొన్నారు….