గుజరాత్ ప్రభుత్వం-సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ భాగస్వామ్యం

  • గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ మూడవ రోడ్‌షో విజయవంతం

హైద‌రాబాద్, (ఆంధ్ర‌ప్ర‌భ ) : గుజరాత్ ఐటి / ఐటీఈఎస్ పాలసీ 2022-27 కోసం గుజరాత్ ప్రభుత్వం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ భాగస్వామ్యంతో గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ తమ మూడవ రోడ్‌షోను హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించింది. అసోచామ్ సహకారంతో హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. ఈ రోడ్ షో లో గణేష్ హౌసింగ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, మిలియన్ మైండ్స్ టెక్ సిటీని హైదరాబాద్ టెక్ నెట్‌వర్క్‌కు పరిచయం చేయటంతో పాటుగా గుజరాత్ పరివర్తనాత్మక కార్యక్రమాలు, విధానాలను ప్రదర్శించారు.

ఈకార్యక్రమంలో అసోచామ్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మండలి మాజీ ఛైర్మన్, ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అండ్ భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఈపీసీఈఎస్ ఛైర్మన్ శ్రీకాంత్ బాడిగతో పాటుగా గుజరాత్ ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ముఖ్య కార్యదర్శి మోనా ఖాంధర్, ఐఏఎస్, కవితా రాకేష్ షా, ఐఏఎస్ డైరెక్టర్ – డైరెక్టరేట్ ఆఫ్ ఐసిటి అండ్ ఇ-గవర్నెన్స్, గుజరాత్ ప్రభుత్వం, గిఫ్ట్ సిటీ డైరెక్టర్ – ఐఎఫ్ఎస్ సీ విభాగం అధిపతి సందీప్ షా, ఐటి అండ్ ఐటీఈఎస్ – అసోచామ్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మండలి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిటీఓ, ప్రణవ గ్రూప్ రాంబాబు బూరుగు కన్వీనర్, గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అధ్యక్షుడు వీరేన్ మెహతా, ప్రముఖ పరిశ్రమ నాయకులు, విధాన నిర్ణేతలు, గుజరాత్ ప్రభుత్వం నుండి సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ అన్మోల్ పటేల్ తన సంతోషం వ్యక్తం చేస్తూ భారతదేశంలో ప్రధాన ఐటీ హబ్‌గా వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందన్నారు. అనేక ప్రముఖ టెక్ కంపెనీలు నగరంలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయన్నారు. గుజరాత్ ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ మోనా ఖాంధర్, ఐఏఎస్ మాట్లాడుతూ… గుజరాత్ ఐటి / ఐటీఈఎస్ పాలసీ 2022-27 అత్యున్నత శ్రేణి తయారీ, ఆర్ అండ్ డి, డిజిటల్ పరివర్తనను సజావుగా అనుసంధానించే శక్తివంతమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పర్యావరణ వ్యవస్థను సృష్టించాలనే తమ లక్ష్యం ప్రతిబింబిస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *