TG | నగరంలో తొలి సైబర్‌ ల్యాబ్‌ ఏర్పాటు..

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ క్రైంబ్యూరో : హైదరాబాద్‌ నగరంలో డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌, డేటా రికవరీ కోసం ఎఫ్‌డీఐ ల్యాబ్స్‌ నాంపల్లిలో తన తొలి అత్యాధునిక సైబర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ఇండియన్‌ ఆఫీస్‌ ఆటోమేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రత్యేక విభాగంగా పని చేసే ఈ ల్యాబ్‌, డిజిటల్‌ భద్రతా అవసరాల పరిష్కారానికి కీలక కేంద్రంగా మారనుందని నిర్వాహకులు వెల్లడించారు.

ఈ ఆధునిక సైబర్‌ ల్యాబ్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు డేటా పునరుద్ధరణ (రికవరీ), డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌, డేటా ఉల్లంఘనలపై విచారణ వంటి సేవలు అందించనున్నారు.

సంక్లిష్టమైన డిజిటల్‌ పరిశోధనలకు ఈ ల్యాబ్‌ సిద్ధంగా ఉండేలా రూపొందించబడిందని నిర్వహకులు తెలిపారు. ఈ ల్యాబ్‌ తెలుగు రాష్ట్రాల్రకు ప్రధాన కార్యాలయంగా సేవలందించనుందని నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *