నిజామాబాద్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు వెలుగుచూసింది. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి రెండు రోజులుగా జ్వరం, దగ్గు, ఆయాసం కావడంతో శనివారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)కు వచ్చారు.
వైద్యులు ర్యాపిడ్ టెస్టు చేయడంతో కరోనా పాజిటివ్ అని తేలింది. సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసుకు వైద్యులు సమాచారం అందించడంతో జీజీహెచ్ 7వ అంతస్తులోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 2020 లో కూడా ఇదే వ్యక్తికి కొవిడ్ సోకినట్లు సమాచారం.