సెమిస్టర్‌ పరీక్షల భయంతో…

  • బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: కర్నూలు నగరంలోని నిర్మల్‌నగర్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన భరత్‌కుమార్‌ (21) అనే బీటెక్‌ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగింది.

భరత్‌ స్థానిక ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. సెమిస్టర్‌ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో మానసిక ఆందోళనకు గురై, పరీక్షల భయంతోనే ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply