Delhi – పోస్టల్ బ్యాలెట్ లలో బీజేపీ ఆధిక్యం – కేజ్రీవాల్ ,అతిషి,సిసోడియా వెనుకంజ

ఢీల్లీ అసెంబ్లీ ఎన్నికల 2025 ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయింది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు.

అనంతరం ఈవీఎంలలో ఉన్న ఓట్లు లెక్కించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఆప్ వెనుకబడింది. కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన సీఎం అతిషి వెనుకంజలో ఉండగా.. న్యూఢిల్లీ నుంచి పోటీ చేసిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి కంటే వెనుకంజలో ఉన్నారు. జంగ్ పూరాలో మాజీ మంత్రి సిసోడియా వెనుకంజలోనే ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులోబీజేపీ దూసుకుపోతుంది.

మొత్తం 70 స్థానాలకు గాను 31 చోట్ల బీజేపీ, అప్ 23 స్థానాలలో ఆధిక్యం లో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *