Cricket | నేడే న్యూజిలాండ్, భార‌త్ తొలి వ‌న్డే

Cricket | నేడే న్యూజిలాండ్, భార‌త్ తొలి వ‌న్డే

  • వడోదరలోని BCA స్టేడియంలో మ్యాచ్
  • మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం

Cricket | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : కొత్త సంవ‌త్స‌రంలో తొలి సిరీస్​కు భారత్ సిద్ధమైంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. 3 వన్డేల సిరీస్ లో భాగంగా నేడు ఈ రెండు జట్లు తొలి మ్యాచ్‌లో తలపడతాయి. ఈ కొత్త ఏడాదిని విజయంతో మొదలు పెట్టాలని టీమ్ఇండియా భావిస్తోంది. వడోదర స్టేడియం వేదికగా ఈ మ్యాచ్​ (Match) జరగనుంది. వడోదరలోని BCA స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ కోసం స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నెట్స్​లో ప్రాక్టీస్ చేశారు. పూర్తి ఫిట్​నెస్​తో రేపు బరిలోకి దిగనున్నారు. గతేడాది ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్​​ల్లో అద్భుతంగా రాణించడంతో మరోసారి అభిమానుల కళ్లన్నీ వీరిద్ద‌రి పైనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరూ భీకర ఫామ్​లో ఉన్నారు. ప్రస్తతం వన్డే ర్యాకింగ్స్​లో టాప్ 2 స్థానాలు ఈ ఇద్దరివే. గతఫామ్ కొనసాగిస్తూ మరోసారి ఈ సిరీస్​లో రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Cricket

Cricket | కెప్టెన్ శుభ్​మన్ గిల్ రాణించేనా?

కెప్టెన్ శుభ్​మన్ గిల్ విశ్రాంతి తర్వాత బరిలోకి దిగనున్నాడు. వన్డే జట్టుకు కెప్టెన్ అయ్యాక గిల్ నుంచి పెద్ద ఇన్నింగ్స్​ రాలేదు. ఈ సిరీస్​లోనైనా గిల్ బ్యాట్​తో రాణించాల్సి ఉంది. అటు శ్రేయస్ అయ్యర్ కూడా ఆడే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్​లో రో-కో, గిల్​తోపాటు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాతో పటిష్ఠంగా ఉంది. ఇక ఆల్​రౌండర్ల విభాగంలో పోటీ ఎక్కువగానే ఉంది. సీనియర్ కోటాలో జడ్డూకు స్థానం ఖాయంగానే కనిపిస్తుంది. అయితే వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) మధ్యలో పోటీ ఉంది. ఈ ఇద్దరిలో ఒకరు బరిలో దిగే ఛాన్స్ ఉంది. పేస్ బౌలింగ్​లో సీనియర్ మహమ్మద్‌ సిరాజ్‌ నాయకత్వం వహించనున్నాడు. అతడితోపాటు అర్షదీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా జట్టులో ఉండనున్నారు. వీళ్లతోపాటు స్పెషలిస్ట్​ స్పిన్నర్​గా కుల్దీప్ యాదవ్​కు జట్టులో చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఓవరాల్​గా భారత్ బ్యాటింగ్​, బౌలింగ్​లో బలంగానే ఉంది.

Cricket

Cricket | న్యూజిలాండ్ జట్టులో..

న్యూజిలాండ్ జట్టులో స్టార్ (Star) ఆటగాళ్లు ఈ సిరీస్​కు దూరమయ్యారు. దీంతో మైఖేల్ బ్రాస్‌వెల్‌ నాయకత్వంలో కివీస్ ఆ సిరీస్​లో ఆడనుంది. డేవన్ కాన్వే, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ మినహా ప్రత్యర్థి జట్టులో చెప్పుకోదగ్గ సీనియర్ ఆటగాళ్లు లేరు. దీంతో యువ ఆటగాళ్లతో కూడిన న్యూజిలాండ్ భారత్​పై సిరీస్​లో ఏ మేరకు రాణిస్తుందో ఆసక్తి నెలకొంది.

Cricket

Cricket | మ‌ధ్యాహ్నం 1.30గంట‌ల‌కు..

ఈ సిరీస్​కు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. తొలి వన్డే వడోదర కోటంబి మైదానం వేదికగా జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఒంటిగంటకు టాస్ (Toss) పడనుంది. అయితే కోటంబి స్టేడియం బ్యాటింగ్​కు సహకరిస్తుంది. బంతి నేరుగా బ్యాట్​పైకి వస్తుంది. దీంతో రో-కో నుంచి భారీ ఇన్నింగ్స్​ ఆశించవచ్చు! అయితే తొలుత బౌలింగ్ చేసే జట్టుకు అడ్వాంటేజ్​గా ఉంటుంది. రాత్రి మంచు ఉండే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో టాస్ కీలకం కానుంది.

Cricket

Cricket | ఇక్క‌డ చూడొచ్చు..

ఈ సిరీస్​కు స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌, ఓటీటీ ప్లాట్​ఫామ్ జియోస్టార్​ అధికారిక బ్రాడ్​కాస్టర్లుగా వ్యవహరిస్తున్నాయి. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్​కు (Network) సంబంధించిన టెలివిజన్ ఛానెల్​లో లైవ్ మ్యాచ్ ప్రసారం అవుతుంది. అలాగే జియోస్టార్​లో లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే జియోస్టార్​లో ఉచితంగా మ్యాచ్ చూడడం కుదరదు. దీనికి సబ్​స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, జియో తమ యూజర్లకు ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్స్​పై జియోస్టార్ ఫ్రీ సబ్​స్క్రిప్షన్ ఇస్తుంది.

Cricket

CLICK HERE TO READ ఏం చేస్తాం.. నా త‌ల రాత‌!

CLICK HERE TO READ MORE

Leave a Reply