న్యూ ఢిల్లీ : ఇండియా-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆపరేషన్ సిందూర్, తర్వాత భారత్ టార్గెట్ గా పాక్ క్షిపణి దాడుల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య యుద్దవాతావరణం నెలకొంది.
ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ కీలక సమాచారాన్ని వెల్లడించేందుకు మీడియా సమావేశం నిర్వహించింది. ఇందులో మరోసారి విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీతో పాటు సోఫియా ఖురేషి తాజా పరిణామాల గురించి వివరించారు.పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో పలు ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించింది… మనం వాటిని సమర్థంగా తిప్పి కొట్టామని కల్నల్ సోఫియా ఖురేషీ చెప్పారు.
పాకిస్థాన్ సైనిక స్థావరాలపై మనం దాడి చేయలేదు… కానీ పాక్ మాత్రం మన సైనిక స్థావరాలపై దాడికి ప్రయత్నించిందన్నారు. డ్రోన్, మిస్సైల్స్ తో దాడులకు ప్రయత్నించిందన్నారు.
Okఎయిర్ డిఫెన్స్ సిస్టం ద్వారా తిప్పికొట్టామని తెలిపారు.పాకిస్తాన్ లోని లాహోర్ సహా పలు ప్రాంతాల్లో వారి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లను నిర్వీర్యం చేశామని వివరించారు. కుప్వారా, బారాముల్లా, రాజోరీ సెక్టర్ లలో 16 మంది పౌరులు పాకిస్తాన్ కాల్పుల్లో మరణించారని వెల్లడించారు.
పాకిస్తాన్ లోని లాహోర్ సహా పలు ప్రాంతాల్లో వారి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లను నిర్వీర్యం చేశామని వివరించారు
.ఇక విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ.. మొదట పాకిస్తాన్ పహల్గాం దాడితో భారత్ ను రెచ్చగొట్టిందని.. దానికి ప్రతిఘటనగా ఆపరేషన్ సింధూర్ చేపట్టామని తెలిపారు. లష్కరే తొయిబా భారత్ పై ఎలాంటి దాడులు చేస్తోందో.. ప్రపంచానికి ఐక్యరాజ్య సమితి వేదికలపై చెప్పామని వివరించారు.TRF ఉగ్రవాద సంస్థ పహల్గాం దాడిని తామే చేశామని అంగీకరించిందన్నారు. అందువల్లే మనం ఆ సంస్థలపై దాడులు చేశామన్నారు.
పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలను లక్ష్యం చేసుకోలేదని.. కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశామని వెల్లడించారు.పాకిస్తాన్ లో ఉగ్రవాదులే లేరని పాకిస్తాన్ మంత్రి చెబుతున్నారని.. వాళ్లు తమకు ఉగ్రవాదులకు సంబందం లేదని చెప్పుకోడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎలాంటి సాయం చేస్తోందో ప్రపంచానికి తెలిసిందే అన్నారు.
ప్రపంచంలో జరిగిన పలు ఉగ్రవాద దాడులకు పాకిస్తాన్ తో సంబంధాలున్నాయన్నారు.కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడ్ ఎక్కడి వాడని మిస్రి ప్రశ్నించారు. పాకిస్తాన్ అంతర్జాతీయ సమాచారాన్ని తప్పుదారి పట్టిస్తోందని.. పలువురు చనిపోయారని చెబుతున్న ఉగ్రవాదులు ఇప్పటికీ పాకిస్తాన్ లోనే బతికి ఉన్నారని వివరించారు.పాకిస్థాన్ లో సామాన్య పౌరులు చనిపోయారని అంటోంది.. అందులో నిజం లేదన్నారు. అన్ని దాడులు చాలా జాగ్రత్తగా సెలక్ట్ చేసాం. అన్ని ఉగ్రవాద స్థావరాలే. ఎలాంటి సామాన్య పౌరులు చనిపోలేదు. ఉగ్రవాదులకు పాక్ గౌరవంతో ఖననం చేయడం దారుణమన్నారు.ఇండియా మత సంస్థలపై దాడులు చేస్తోందని ఆరోపించిందని… ఇది అసత్యమని అన్నారు.
టెర్రరిస్టులతో సంబంధమున్న ప్రాంతాలపైనే దాడి చేసామని అన్నారు. జమ్ము కాశ్మీర్ లో మత సంస్ధలపై పాక్ దాడులకు దిగింది. ఇందులో ముగ్గురు చనిపోయారని తెలిపారు. ఉగ్రవాదులకు జాతీయ గౌరవం ఇవ్వడం పాకిస్తాన్ కు మాత్రమే చెల్లుతుందని చెప్పారు. పాకిస్తాన్.. మతపరమైన నిర్మాణాలను ఉగ్రవాదుల శిక్షణకు వినియోగిస్తోందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ లో సిక్కు లకు చెందిన గురుద్వారాపై దాడి చేశారని చెప్పారు.బుధవారం ఉదయం నుంచి పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో జరిపిన దాడుల్లో 16 మంది భారత పౌరులు చనిపోయారని పేర్కొంటూ.. చనిపోయిన వారి ఫొటోలు చూపించారు.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మత విద్వేశాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని… ఆ తర్వాతే పహల్గాం దాడి జరిగిందని అన్నారు.ఇకపై పాకిస్తాన్ ఆగడాలు భారత్ లో ఏమాత్రం చెల్లవని.. పాకిస్తాన్ దాడులను ప్రపంచం మొత్తం ఖండిస్తోందని అన్నారు. పాకిస్తాన్ ఏమైనా దాడులకు దిగితే తప్పకుండా తిప్పి కొడతామని చెప్పారు.
సింధు జలాల ఒప్పందానికి సంబంధించి చాలా తప్పుడు సమాచారం ప్రచారంలో ఉందని అన్నారు. సింధు జలాల ఒప్పందం గడువు తీరిపోయిందని తెలిపారు. మనం 60 ఏళ్లుగా దాన్ని గౌరవిస్తూనే ఉన్నామన్నారు… వాళ్లు పలు సార్లు యుద్ధం చేసినా మనం ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని తెలిపారు. సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణ, మార్పులు చేర్పులకు సంబంధించి పలు సార్లు పాకిస్తాన్ ని సంప్రదించినా వారి నుంచి స్పందన లేదన్నారు.